తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 మంచి జోష్ లో సాగుతుంది.  ఇప్పటికే నటి హేమ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ట్రాన్స్  జెండర్ తమన్నా వచ్చింది.  అయితే తమన్నా వచ్చిన వెంటనే తన టార్గెట్ వరుణ్ సందేష్ ఆయన సతీమణి వితిక అని చెప్పడం విశేషం.  దాని వెనక ఓ కారణం ఉందని..మహేష్ విట్టా విషయంలో ఆ కపుల్స్ చాలా నీచంగా ప్రవర్తించారని..ఇష్టం వచ్చినట్లు తిట్టారని తన సహ ఇంటి సభ్యులతో చెప్పింది.  ప్రస్తుతం వెరైటీ టాస్క్ లతో బిగ్ బాస్ 3 రన్ అవుతుంది. 

ఇక నాగార్జున శని, ఆదివారాల్లో చేసిన సందడి అంతా కాదు.  తనతోపాటు పండు అంటూ ఓ కోతి బొమ్మతో మాట్లాడుతూ..మంచి ఎంట్రటైన్ మెంట్ చేశారు నాగార్జున.  ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన నటి హేమ ఇంటి సభ్యుల ఆటతీరు చాలా బాగుందని..అందరూ సేఫ్టీ గేమ్ ఆడుతున్నారని, కాకపోతే తాను అందరికోసం చూసి చివరికి తానే బలైపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

  సాధారణంగా సినిమాలు రిలీజ్ ఉంటే ఆ సినిమాకు సంబంధించిన వారు బిగ్ బాస్ లోకి వెళ్లి ప్రమోషన్ చేయడం సహజం.  ఈ నేపథ్యంలో ఆగష్టు 9న మన్మథుడు 2 సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ మూవీలో నటించిన రకూల్ ప్రీత్ సింగ్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. నాగార్జున కూడా మన్మథుడు 2 ప్రమోషన్స్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్, రకుల్ ప్రీత్ లు ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యారట.

బాగ్‌బాస్ 3 స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ కాస్త హాట్ హాట్‌గానే సాగుతోంది. అయితే ఈ వారంలో ఇంటి సభ్యులు హిమజ, శ్రీముఖిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. మరి ప్రేక్షకులు వీరిద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..నాగార్జున ఎవరికి షాక్ ఇస్తారో శని,ఆదివారాల వరకు వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: