టాలీవుడ్ ప్రముఖ ఛాయాగ్రహకుడు చోటాకే నాయుడు బంధువు సందీప్ కిషన్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీ తర్వాత మనోడు నటించిన సినిమాలు పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. దాంతో కోలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.  అక్కడ మంచి సక్సెస్ సాధించిన తెలుగు సినీ పరిశ్రమపై మక్కువతో ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు.  ఆ మద్య కృష్ణవంశి దర్శకత్వంలో ‘నక్షత్రం’ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన విఫలం పొందింది.  

ఇటీవల సందీప్ కిషన్ హీరోగా అన్యా సింగ్ హీరోయిన్ గా నటించిన థ్రిల్లింగ్ హర్రర్ కామెడీ మూవీ  ‘నిను వీడని నీడను నేనే’  మంచి విజయాన్ని అందుకుంది.  తాజాగా నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా బాలీవుడ్ అందాల తార హన్సిక హీరోయిన్ గా 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' తెరకెక్కిస్తున్నారు. గతంలో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో 'సీమశాస్త్రి'.. 'సీమటపాకాయ్'.. 'దేనికైనా రెడీ' .. 'ఈడోరకం ఆడోరకం' మూవీస్మా ర్కుతో ప్రేక్షకులను నాన్ స్టాప్ గా నవ్వించాయి. 


ఇక నాగేశ్వర రెడ్డి ఈ సారి కూడా పూర్తి వినోదభరితమైన కథనే తెరపై ఆవిష్కరించడానికి సిద్ధమయ్యాడు.  ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, తాజాగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 'నిను వీడని నీడను నేనే' సినిమా ఫలితంతో ఊరట చెందిన సందీప్ కిషన్ కి  'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' మంచి సక్సెస్ అందిస్తుందని గట్టి నమ్మకంగా ఉన్నాడు.  చాలా రోజుల తర్వాత హన్సిక తెలుగు తెరపై కనిపిస్తుంది..మరీ ఈ అమ్మడికు కూడా ఈ మూవీ కలిసి వస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: