టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ సహా పలు ఇతర భాషల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ స్థాయి నుండి హీరోయిన్ స్థాయి వరకు పలు సినిమాల్లో నటించిన దిగ్గజ అతిలోక సుందరి శ్రీదేవి, దాదాపుగా కొన్నేళ్లపాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పలువురు స్టార్ హీరోలందరి సరసన గొప్ప సినిమాల్లో నటించిన శ్రీదేవికి మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే రెండేళ్ల క్రితం హఠాత్తుగా ఆమె మరణించడంతో ఆమె అభిమాన లోకం మొత్తం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. 

 

ఇక పెద్ద కూతురు జాన్వీని సినిమా తెరపై చూడాలన్న ఆమె కోరిక మాత్రం బ్రతికుండగా తీరలేదు. ఆమె మరణాంతరం దఢక్ అనే సినిమా ద్వారా బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇక ఫస్ట్ సినిమాలో తన అందం పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ, తన తల్లి పేరు నిలబెడతానని చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల కొద్దిరోజులుగా ఒక కేంద్ర మంత్రి మనవడైన శిఖర్ తో ఆమె నడుపుతున్న ప్రేమాయణంపై బాలీవుడ్ లో విపరీతముగా కథనాలు వెలువడుతుండడంతో ఆమె ఫ్యామిలీ ఒకింత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు తన ప్రియుడు శిఖర్ తో కలిసి మీడియాకు చిక్కిన జాన్వీ పై కొందరు శ్రీదేవి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. 

 

మీ అమ్మ శ్రీదేవికి ఉన్న గొప్ప పేరు నువ్వు ఈ విధంగా చేస్తూ చెడగొడుతున్నావు, దయ చేసి ఇకపై ఇటువంటి చర్యలకు దూరంగా ఉండు, హీరోయిన్ గా నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంది, అలానే నీకు కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి కదా, వాటిని సద్వినియోగం చేసుకుని మీ అమ్మ పేరు గొప్పగా నిలబెట్టు అంటూ ఆమెకు సలహాలిస్తూ పలువురు పోస్టులు పెడుతున్నారు. అయితే జాన్వీ ప్రేమాయణం పై తండ్రి బోనీ కపూర్ మాత్రం ఇప్పటివరకు నోరు విప్పకపోవడం విడ్డూరమని, కావున ఆయన ఇకనైనా అసలు ఇందులో వాస్తవం ఎంత ఉందొ మీడియాకు వెల్లడిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: