మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కి మంచు విష్ణు ఇచ్చిన వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఇలా మంచు విష్ణు ఇలా సాయి తేజ్ కి వార్నింగ్ ఇవ్వడం వెనుక ఒక ఆసక్తికర కారణం ఉంది. ప్రస్తుతం సోలో లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్న సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ ఒక సినిమాను చేస్తున్న విషయం  తెలిసిందే. ‘ప్రతిరోజు పండగే’ ఘన విజయం తరువాత ఈ వారం రాబోతున్న వాలంటైన్ డే సందర్భంగా సోలో బ్రతుకు గురించి సాయి తేజ్ ఒక ఫిలాసఫీ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 


తన దృష్టిలో తన దృష్టిలో సోలో బ్రతుకు ఎందుకు బెటరో చెపుతూ ఒక త్విట్ చేసాడు. సోలో బ్రతుకు వల్ల తనకున్న అడ్వాంటేజస్‌ ను తన ట్వీట్‌లో వివరంగా వివరించాడు. ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే పెద్దగా టెన్షన్ ఉండదు. రెస్టారెంట్‌కి వెళ్తే నా ఫుడ్‌ కి మాత్రమే నేను పే చేస్తాను. క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చినా గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని ఉండదు. క్రికెట్ జిమ్ హోమ్ ఫ్రెండ్స్ ఇలా తనకు నచ్చినంత టైమ్ తనకు నచ్చిన వారితో స్పెండ్ చేసుకోవచ్చు అంటూ ట్విట్ చేసి సోలో లైఫ్ లోని లాభాలను వివరించారు.  


ఈ  ట్విట్ ను పూర్తి గా చదివిన మంచు విష్ణు సాయి తేజ్ ను టార్గెట్ చేస్తూ విభిన్నంగా స్పందించాడు. 
‘తమ్ముడు మై లిటిల్ బ్రదర్.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా’’.. అంటూ జోక్ చేసాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ సాయి తేజ్ ఈ సోలో లైఫ్ ను ఎంత కాలం కొనసాగిస్తాడు అన్న విషయం ఈ మూవీ సక్సస్ ను బట్టి ఆధారపడి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: