బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హా 2010లో దబాంగ్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే సోనాక్షి కుర్రకారుని తన అందం, అభినయంతో మంత్ర ముగ్ధుల్ని చేసింది. తొలి చిత్రంతోనే సోనాక్షి బాలీవుడ్ లో స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. సోనాక్షి సిన్హా విమర్శలకు అంతగా స్పందించదు. కానీ మితిమీరినప్పుడు సరైన విధంగా కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు కరోనా నిర్మూలన కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సహాయక చర్యలలో పాలు పంచుకునేందుకు పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు భారీగా విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడంతో వారిపై దుమ్మెత్తి పోస్టున్నారు నెటిజన్స్. వివరాలలోకి వెళితే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఇప్పటి వరకు పీఎం సహాయనిధికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి సాయం చేయలేదట.
సోనాక్షి కోస్టార్స్ అందరు సాయం చేస్తుంటే తాను మాత్రం ఏం పట్టనట్టు కూర్చోవడాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు. ఆమెని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన సోనాక్షి.. కొంత మంది మంచి పని చేసి చెప్పుకుంటారు. మరికొందరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. సెకండ్ ఆప్షన్ని నేను పాటిస్తాను. నన్ను ట్రోల్ చేసే వారి కోసం నేను ఒక నిమిషం మౌనం పాటిస్తాను. విపత్కర సమయంలో ట్రోల్స్ చేయడం కంటే ఈ విలువైన సమయాన్ని మంచి కోసం ఉపయోగించండి. విరాళం ప్రకటించడం అనేది నా వ్యక్తిగత విషయం అంటూ చెప్పుకొచ్చింది సోనాక్షి.
అంతేకాకుండా టాలీవుడ్ మహిళా దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇలానే రియాక్ట్ అయింది. 'మీరు కోరుకుంటున్నట్లు మేము ఎందుకు డొనేషన్స్ ఇవ్వాలి..ప్రైవేట్ గా విరాళాలు ఇచ్చిన కొన్ని లక్షల మంది ఉన్నారు..ప్రతీది పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి' అంటూ ఘాటుగా స్పందించింది. అలాగే డైరెక్టర్ దేవా కట్టా కూడా దీనిపై స్పందిస్తూ 'విరాళం అనేది రౌడీ మాములు కాదని, కొందరు ఇచ్చినా పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో, మరింకేదో కారణం చేతనో బయటకు చెప్పారు. అంత మాత్రానా వాళ్లని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని' కామెంట్ చేసాడు. అయితే దీనికంటే ముందు బిగ్బీ అమితాబ్ బచ్చన్పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన అమితాబ్ తనపై వచ్చిన ట్రోల్స్ను తిప్పికొట్టారు.