స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం తనకు ఎంతో ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను చిత్రబృందం విడుదల చేశారు. ఊర మాస్ లుక్ తో క్రిమినల్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం యొక్క టైటిల్ ను 'పుష్ప' గా పెట్టారు. ఆర్య మరియు ఆర్య 2 తర్వాత బన్నీ సుక్కు కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం 'పుష్ప'. రష్మిక మందన చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

ఇకపోతే బన్నీ చిత్రంలో చిత్తూరు జిల్లా యాస లో మాట్లాడి ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే కథ ను సుకుమార్ రకంగా డైరెక్ట్ చేస్తాడని ఇప్పుడు అభిమానులు అందరిలో ఆసక్తి నెలకొంది. తన ముందు సినిమాలో అల్లు అర్జున్ ని ఇలాగే మాస్ గెటప్ లో చాలా వైవిధ్యభరితంగా చూపించిన సుకుమార్ సారి బన్నీ ని ఎలా వాడుకుంటున్నాడు అన్న విషయంపై ఇప్పటికే చర్చ మొదలైపోగా చిత్రంలో బన్నీ కి ధీటుగా ఉండే బలమైన ప్రతినాయకుడు విజయ్ సేతుపతి అని వార్తలు కూడా బయటకు వచ్చేశాయి.

 

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు గత రెండేళ్ల కాలంలో చాలా బాగా దగ్గరయ్యాడు. తెలుగులో నేరుగా ఒక్క సినిమా తీయకపోయినా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కి ఇక్కడ చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే విజయ సేతుపతి చిత్రానికి డేట్లు సర్దుబాటు చేయలేక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. అందువల్ల విలన్ క్యారక్టర్ కోసం తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహాని తీసుకోవాలని సుక్కు అండ్ టీమ్ డిసైడ్ అయినట్లు సమాచారం. మొన్ననే 'డిస్కో రాజా'తో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నేషనల్ అవార్డు విన్నర్ 'పుష్ప'లో ఆఫర్ వస్తే టాలీవుడ్ లో విలన్ గా పాగా వేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: