టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా ఒక నిర్మాణ సంస్థ ను స్థాపించి..మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించి.. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.ఈ నేపథ్యంలో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు అంకితం ఇస్తూ..హీరో నాని తన టీమ్ తో కలిసి 'దారే లేదా' అనే వీడియో సాంగ్ ని విడుదల చేసారు.తాజాగా దానికి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ పాటపై టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఫ్రంట్ లైన్ వర్కర్లకు అంకితమిస్తూ రూపొందించిన ఈ పాట తనను ఎంతో ఆకట్టుకుందని మహేష్ పేర్కొన్నారు.

హీరో నాని,చాయ్ బిస్కెట్ టీమ్ సంయుక్తంగా కలిసి చేసిన ఈ కార్యక్రమం  ఎంతో ఆదర్శవంతమైందని పేర్కొన్నారు మహేష్.ఇక మహేష్ చేసిన ట్వీట్ కు నాని బదులిస్తూ.."థ్యాంక్యూ సర్,మీ స్పందన మా పాటను ఎంతో మంది హృదయాలకు చేరుస్తుంది.ఇంకా ఎక్కువ అడగదలచుకోలేదు" అని పేర్కొన్నారు.అంతేకాదు ఈ పాటలో నటించిన సత్య దేవ్ సైతం మహేష్ ట్వీట్ కి స్పందిస్తూ..మహేష్ కు ధన్యవాదాలు చెప్పాడు.ఇక కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల గొప్పతనం తెలిసేలా తీసిన ఈ పాటను జూన్ 18 న విడుదల చేశారు.

సంగీత దర్శకుడు విజయ్ మ్యూజిక్ అందించిన ఈ పాటకి కె. కె.సాహిత్యం అందించాడు.తెలుగు తో పాటుగా తమిళ భాషలో కూడా ఈ పాట రూపొందడం విశేషం.ఇక నాని సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'టక్ జగదీష్' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడింది.ఇక లాక్ డౌన్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాక ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: