విభిన్న కథల్లో.. విభిన్న పాత్రల్లో.. ఒదిగిపోతున్నాడు రానా. నటించే ప్రతీ సినిమాలో తనలోని ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.  రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన 'లీడర్'తో తన సినీ భవిష్యత్తును మొదలు పెట్టాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రానా సినీ కెరీర్‌లో ఒక మైలురాయిలా మిగిలిపోయిందనే చెప్పొచ్చు. అయితే లీడర్ సినిమాకు సీక్వెల్ తీస్తానని శేఖర్ కమ్ముల అంటున్నాడు. అయితే ఇప్పటికే ధనుష్ తో మల్టీలింగ్వల్ స్టార్ట్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్.. ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలు పెడతాడో మరి.  

ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ రగ్గడ్‌ లుక్‌లో రఫ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు ఫస్ట్‌ లుక్‌ తోనే మంచి టాక్ వచ్చింది. టీజర్‌తో అంచనాలు మరింత పెంచుకున్న ఈ సినిమా రెండు పార్ట్ లుగా విడుదలవుతోంది.

మరోవైపు విక్టరీ వెంకటేశ్‌ సైతం ఈ ఏడాది రెండు సీక్వెల్స్‌ చేస్తున్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్3' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ 'ఎఫ్2' సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే మళయాళీ డైరెక్టర్‌ జీతు జోసెఫ్‌తో 'దృశ్యం2' సినిమా చేస్తున్నాడు. ఇక 'దృశ్యం2' సినిమా దసరాకు విడుదల కాబోతోంది. నాగార్జున సంక్రాంతి హిట్స్‌లో హయ్యెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన సినిమా 'సోగ్గాడే చిన్ని నాయానా'. నాగార్జున డ్యుయల్‌ రోల్‌ ప్లే చేసిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్‌ వస్తోంది. 'బంగార్రాజు' టైటిల్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ ప్రీక్వెల్‌లో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు.

శ్రీను వైట్ల సరైన హిట్‌ చూసి చాలా కాలమైంది. 'ఆగడు' నుంచి వైట్లకి వరుస ఫ్లాపులొచ్చాయి. 8 ఏళ్ల నుంచి హిట్ కోసం ఫైట్‌ చేస్తూనే ఉన్నాడు. కానీ సక్సెస్ మాత్రం రాట్లేదు. అయితే ఈసారి ఎలాగైనా ఫామ్ అందుకోవాలని 'ఢీ' సీక్వెల్‌ స్టార్ట్ చేశాడు. 14 ఏళ్ల తర్వాత మంచు విష్ణుతో 'డీ అండ్ డీ' అనే పేరుతో సినిమా తీస్తున్నాడు శ్రీను వైట్ల. మరి సీక్వెల్స్ దర్శక, నిర్మాతలకు.. నటులకు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: