ఇక హీరోయిన్ల క్రేజ్ ని బట్టి అటు దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్లు ఎంత రెమ్యూనిరేషన్ అడిగినా కూడా ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఇలా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వారిలో సీనియర్ హీరోయిన్లు టాప్ లో ఉండడం గమనార్హం. ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన నయనతార పారితోషకం లో టాప్ లో కొనసాగుతోంది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాగా ప్రస్తుతం ఒక్కో సినిమాకి నయనతార నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.
అంతేకాదండోయ్ నయనతార ఏ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం రాకుండా ఉంటాను అని ముందుగానే చెబుతూ ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ క్వీన్ గా కొనసాగుతున్న అనుష్క శెట్టి ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు అనుష్క ఏకంగా 3.5 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటుందట. ఇక ఆ తర్వాత సమంత 3 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉండటం గమనార్హం. పూజా హెగ్డే కూడా సమంతతో సమానంగా మూడు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందట. ఇక ఆ తర్వాత ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించిన రష్మిక మందన 2.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుందట.. ఇక మరో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట.