యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ-2 ఈ సినిమా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని భారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది కృష్ణుడు రహస్యాల నేర్పదంలో రూపొందించిన ఈ సినిమాలు హీరోయిన్గా మలయాళం ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటించింది. రిలీజ్ ముందు ఈ సినిమా ట్రైలర్ టీజర్ పాన్ ఇండియా వైడ్ గా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ఎట్టకేలకు నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. రెండుసార్లుగా ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు నిన్నటి రోజున థియేటర్లలో విడుదల చేయడం జరిగింది.


2014 లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా  చిత్రం తెరకెక్కించడం జరిగింది. దీంతో సహజంగానే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఊహించినట్టుగానే ఈ సినిమా నుంచి మంచి టాక్ ఏర్పడింది. మొదటి షో తోనే ఈ సినిమా హిట్  ఆనిపించుకోవడంతో మొదటి రోజు ఆడియన్స్ కూడా రెస్పాన్స్ బాగుందని చిత్ర బృందం తెలియజేసింది. ఇక అక్కడి ప్రేక్షకుల స్పందన చూసి హీరో నిఖిల్ డైరెక్టర్ చాలా ఎమోషనల్ అయ్యారు ఇద్దరు కూడా ఆత్మీయంగా కౌగిలించుకొని తన ఆనందాన్ని తెలియజేశారు.



ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ప్రత్యేకంగా వీక్షించిన డైరెక్టర్ రాజమౌళి ఆయన సోదరుడు ప్రముఖ సంగీత దర్శకుడు అయిన కీరవాణి ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అలా డైరెక్టర్ రాజమౌళిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆయన కాళ్లకు నమస్కరించడం విశేషము. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఒక వీడియో చాలా వైరల్ గా మారుతుంది మరి సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో పాపులర్ అవుతుంది ఈ సందర్భంగా రాజమౌళి అనుపమాను అభినందించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తన పాత్ర హైలెట్గా ఉందని కూడా ప్రశంసించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: