ఎన్నో రోజుల నుంచి జానపద గాయకురాలిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆరుపదుల వయస్సు దాటిన తర్వాత మాత్రం తన గాత్రంతో సెలబ్రిటీ హోదాని దక్కించుకుంది. ఇప్పుడు ఎన్నో మంచి పాటలు పాడుతూ ఎక్కువ ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు.ఇక ప్రేక్షకులు ఎవరైనా సరే కనకవ్వ పాట విన్నారు అంటే చాలు ఆమెకు ఎంత పారితోషకం ఇచ్చిన కూడా తక్కువే అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది అని చెప్పాలి.. అయితే ఒకప్పుడు 2 నుంచి 3000 వరకు ఒక పాటకి పారితోషకం తీసుకుందట కనకవ్వ.
ఇప్పుడు కనకవ్వ పాడిన పాటలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో పారితోషకం కూడా కాస్త పెంచేసినట్లు తెలుస్తోంది. ఏకంగా జనాల్లో ఆమె ఆదరణకు తగ్గట్లుగానే వారితోషకం తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఒక్కరోజు లేదా హాఫ్ డే కాల్ షీట్ కోసం కనకవ్వ ఏకంగా 50,000 వరకు పారితోషకం తీసుకుంటుందట. ఎందుకంటే కనకవ్వ స్టేజి మీద కనిపించింది అంటే చాలు ఎపిసోడ్ వదలకుండా చూసేస్తూ ఉంటారు ప్రేక్షకులు. యూట్యూబ్లో ఆమె పాడిన పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అందుకే ఇక ఈ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి