స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనదైన నటనతో సక్సెస్ సాధించాడు. తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇక అల్లు అర్జున్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ హీరో పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.

ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీయగా అది కూడా మంచి విజయాన్ని సాధించింది. దాదాపు ఈ సినిమా 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టి అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. ఇక ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ దర్శకుడు అట్లితో కలిసి ఏఏ22 సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారట.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను ఎంపిక చేయాలని అనుకుంటున్నట్టుగా ఓ వార్త సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో స్పెషల్ సాంగ్ కోసం సమంతను అనుకుంటున్నారట. ఈ విషయాన్ని సమంతకు చెప్పగా ఆమె సున్నితంగా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. అయినప్పటికీ వినకుండా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని సమంతను తెగ ఇబ్బంది పెడుతున్నారట. మరి సమంత ఐటమ్ సాంగ్ లో నటిస్తుందా లేదా అనే సందేహంలో తన అభిమానులు ఉన్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: