
2025 జనవరిలో పూజా కార్యక్రమాలతో `ఎస్ఎస్ఎమ్బీ 29` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే తాజాగా సినిమా స్టోరీకి సంబంధించి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇచ్చిన లీకులతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
జూలై 25న విడుదల కానున్న తన `సర్జమీన్` మూవీ ప్రమోషన్స్ లో పృథ్వీరాజ్ `ఎస్ఎస్ఎమ్బీ 29` గురించి మాట్లాడారు. `ఇప్పటివరకు ఎవరూ ఊహించని రీతిలో రాజమౌళి సార్ ఈ సినిమా కథను తీర్చిదిద్దుతున్నారు. అది ఒక అద్భుత దృశ్య కావ్యం. ప్రతిఒక్కరినీ మెప్పించేలా కథను చెప్పడంలో రాజమౌళి గారు సిద్ధహస్తుడు. ఆయన సెలెక్ట్ చేసుకునే కథలన్ని ఓ రేంజ్లో ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ఈ చిత్రం ఆడియెన్స్కు విజువల్ ట్రీట్లా ఉంటుంది` అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ఈయన కామెంట్స్ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ లవర్స్ ను కూడా ఎంతగానో ఎగ్జైట్ చేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు