టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించారు. ఇక సినిమాల విషయంపై కూడా యమ స్పీడుగా కనిపిస్తున్నారు. ఇందుకు కారణం ఈ ఏడాది విడుదలైన గేమ్ ఛేంజర్. ఈ సినిమా తర్వాత మెగా అభిమానులు చాలా డిసప్పాయింట్ గా మారిపోయారు. కనీసం మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టుకోకపోవడంతో తన తదుపరి చిత్రం పై చాలా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలనే విధంగా ప్లాన్ చేశారు రామ్ చరణ్. అందుకే వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను లైన్ లో పెడుతున్నట్లు కనిపిస్తోంది.



ఇప్పటికే పెద్ది సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పైన రామ్ చరణ్ కి కూడా చాలానే నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ అదే రేంజ్ లో ఉండేలా మరొక సినిమాని ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. ఆ చిత్రం ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ తో చేయబోయే సినిమానే. ఇది కూడా పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అనే విషయంపై అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ఎందుకంటే సుకుమార్ పుష్ప 3 సినిమా పైన అప్డేట్  ఇవ్వడంతో పుష్ప 3 సినిమా అయిపోయిన తర్వాతే ఈ సినిమా ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ సినిమా గురించి ఒక కీలకమైన అప్డేట్ ఇస్తూ మైత్రి మూవీ నిర్మాతలలో ఒకరైన నిర్మాత నవీన్ మాట్లాడారు. సుకుమార్ గారి తదుపరిచిత్రం పుష్ప 3 కాదని, రామ్ చరణ్ గారితోనే ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చారు. పెద్ది సినిమా పూర్తి అయిన తర్వాత రామ్ చరణ్ గారి సినిమా మొదలవుతుందని అది కూడా వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో మొదలవుతుందంటూ తెలిపారు. ఈ విషయం విన్న మెగా అభిమానులు ఆనందంలో ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు కొంతమేరకు నిరాశపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: