తాజాగా గంపాగుతుగా  ప్రకటించిన నందీ అవార్డ్స్ కి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున రచ్చ మొదలు ఐన సంగతి తెలిసిందే. ఈ అవార్డ్స్ విషయం లో పూర్తి పార్షియాల్ గా ఉన్నారు ఉన్నారు అనీ నందమూరి లేదా చంద్రబాబు సన్నిహితులకి క్లోజ్ గా ఈ అవార్డులు ఇచ్చేసారు అనే నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యం లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ బండ్ల గణేష్ నుంచి కూడా షాకింగ్ కామెంట్ లు వినపడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్ తీరు సరిగా లేదంటూ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ‘ఇవి నంది అవార్డ్స్ కాదు..సైకిల్ అవార్డ్స్. ఆ అవార్డ్స్ కు సైకిల్ అవార్డ్స్ అని పేరు పెడితే బాగుంటుంది.

నాడు ‘మగధీర’ సినిమాలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్ కు అవార్డు ఇవ్వకుండా అన్యాయం చేశారు అని ఆయన ఆరోపించారు. అప్పుడు కూడా ‘మెగా’ ఫ్యామిలీకి అన్యాయం చేశారు. అప్పుడు అధికారంలో ఉంది ‘హస్తం’ కావచ్చు అన్నారు. హస్త గొప్ప సైకిల్ తక్కువ అనేది నా ఉద్దేశం కాదు అంటున్నారు ఆయన " ఏ పార్టీ మీదా నాకు వ్యతిరేకత లేదు కానీ అన్యాయం జరిగితే మాట్లాడుతున్నాను అంతే  " అన్నారు.

ప్రభుత్వ ప్రకటన మీద ఎదురు నిలవడం తప్పు కదా అని అడగగా ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం కరక్టో రాంగో తనకి తెలీదు అనీ తప్పుగా మాట్లాడితే ఉంటె సారీ చెప్పడానికి రెడీ అని గణేష్ చెప్పుకొచ్చారు. అయితే మెగా ఫామిలీ కి అవార్డుల విషయం లో ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతోంది అనేది నిజం అన్నారు ఆయన.


మరింత సమాచారం తెలుసుకోండి: