గత కొన్నాళ్లుగా సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్న శ్రీరెడ్డి నేడు తెల్లవారు జామున ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్పై ఆమె చేసిన అసభ్యకర వ్యాఖ్యల వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నాడని నిన్న వెళ్లడైన విషయం తెల్సిందే. పవన్ను తాను ఉద్దేశ పూర్వకంగా తిట్టలేదు అని, తనను ఒక వ్యక్తి ప్రోత్సహించడం వల్ల తిట్టాను అంటూ క్షమాపణలు చెప్పిన శ్రీరెడ్డి వివాదం ముగిసినట్లే అంటూ ప్రకటించింది. అయితే శ్రీరెడ్డి ధైర్యం కంటే తెగువ ఎక్కువ అని ఆమెను దగ్గరగా చూసినవాళ్ళు చెప్తూ ఉంటారు.
ఇప్పుడు ఆ తెగింపుతోనే శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత శ్రీరెడ్డికి అండగా నిలబడిన జనాలందరూ కూడా వ్యతిరేకులయ్యారు. నిన్నటి నుంచీ శ్రీరెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఉంది. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నందుకు బాధగా ఉందని అందరూ కలిసి తనను ఒంటరిని చేశారని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీరెడ్డి.
ఆ ఆవేదనతోనే ఆత్మహత్యా యత్నం చేసుకుందని అంటున్నారు. శ్రీరెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన విషయం తెలుసుకున్న మహిళ సంఘం నాయకురాలు ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించినట్లుగా తెలుస్తోంది. శ్రీరెడ్డి గత 12 గంటలుగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టక పోవడంకు కారణం అదే అని కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి శ్రీరెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలను వెళ్లడి చేసేందుకు మాత్రం హాస్పిటల్ వర్గాల వారు ముందుకు రావడం లేదు.
దాంతో శ్రీరెడ్డి ఆత్మహత్య విషయమై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాని అలాంటి వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఆమె సన్నిహితులు చెబ్తున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని..ఇవన్నీ అవాస్తవాలని కొట్టి పడేస్తున్నారు..కొంత మంది మహిళా సంఘాలు..ఆమె సన్నిహితులు. ఈ మద్య శ్రీరెడ్డికి సంబంధించిన ప్రతి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..నిజం ఏంటో తెలియాల్సి ఉంది. కాగా, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని..కొంత మంది కొట్టి పడేస్తున్నారు.