బాలీవుడ్ లో ఆషీకీ సినిమాతో పాపులరైనా శ్రద్ధా కపూర్ ప్రస్తుతం
ఇండియాలో క్రేజీ ప్రాజెక్ట్ లో ఒకటైన సాహో సినిమాలో నటించి మెప్పించింది.
ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో అనేక సినిమాలు చేసింది. ఇదిలా ఉంటె
ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సాహో సినిమాలో టాప్
కాప్ పాత్రలో నటించింది.
పాన్ ఇండియా మూవీ గా
తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్
స్క్రీన్ పై చూడని త్రిల్లింగ్ సన్నివేశాలను ఈ మూవీలో చూపించబోతున్నారు.
ప్రభాస్ స్పై గా కనిపించబోతున్నారు. ఆగష్టు 15 వ తేదీన రిలీజ్
కాబోతుండటంతో... సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు.
ముందుగా
ఈ సినిమా ప్రమోషన్స్ ను హీరోయిన్ శ్రద్ధా కపూర్ స్టార్ట్ చేసినట్టు
కనిపిస్తోంది. ఇటీవలే ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో
అనేక విషయాలను మాట్లాడింది. గతంలో తనకు తెలుగు సినిమా నుంచి అవకాశాలు
వచ్చినా చేయలేదని చెప్పింది. సాహో సినిమాలో తన పాత్ర నచ్చడంతో మరో మాట
మాట్లాడకుండా ఒకే చేసినట్టు శ్రద్ధ చెప్పింది.
ఇదిలా
ఉంటె, ఫ్యూచర్ లో తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు
పంపింది. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్నది. ఎంతమంది కొత్త వాళ్ళు
వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఇంకెందుకు ఆలస్యం మన నిర్మాతలు
ఆమె ఇంటిముందు క్యూ కడతారు అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.