ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు మరోసారి చంద్రబాబునాయుడు మీద రెచ్చిపోయారు. ఇటీవల విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి ప్రత్యేక హోదా మీద చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని అన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అంతేకాకుండా కేంద్రం రాష్ట్రంలో బిజెపి ప్రభావం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా రాష్ట్రానికి నిధులు కేటాయించింది అని అన్నారు.


అయితే ఈ క్రమంలో మీడియా సమావేశం ముగించిన తర్వాత ఆయనను విలేకరులు ప్రశ్నించారు..ఈ క్రమంలో ఒక విలేకరి సోము వీర్రాజుకు ఈ  ప్రశ్నలు వేశారు….బీజేపీ ఏపీకి ఏం చేసింది?...విభ‌జ‌న అంశాల‌ను ఎంత‌వ‌ర‌కు నెర‌వేర్చింది? అందులో ఎన్ని నెర‌వేరాయి? మిగిలిన‌వాటిని ఎప్ప‌టికి పూర్తి చేస్తారు? వీటిపై క్లారిటీ ఇవ్వండి అంటూ ఆయ‌న గుక్క‌తిప్పుకోకుండా పలు ప్ర‌శ్న‌లు సంధించారు.


ఆ విలేక‌రి ప్ర‌శ్న‌ల‌కు సోము వీర్రాజు మొహం తెల్ల‌బుచ్చుకున్నారు. ఆయ‌న ఒక్క‌సారిగా కంగుతిన్న‌ట్లుగా క‌నిపించారు. ఈ ప్ర‌శ్న‌ల‌పై ఆయ‌న క‌నీసం స‌మాధానం ఇవ్వ‌డానికి కూడా ఆస‌క్తి చూప‌లేదు.


ఇంత‌లో మ‌రో విలేక‌రి మ‌రో ప్ర‌శ్న సంధించడంతో వీర్రాజు త‌న ఫేస్‌ని అటు ట‌ర్నింగ్ ఇచ్చుకున్నారు. అంతే, వాటికి స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పించుకోగ‌లిగా అని ఆయ‌న ఊపిరి పీల్చుకున్న‌ట్లు ప్రెస్‌మీట్‌లో క‌నిపించారు. మొత్తంమీద బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజయవాడ మీడియా సమావేశం తో బిజెపి పార్టీ రాష్ట్రంలో తలదించుకోవాల్సి వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: