తాజాగా ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరణకు గురైన మోత్కుపల్లి నర్సింహులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల మోత్కుపల్లి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి న్ని కలవడం జరిగింది.ఈ సందర్భంగా మీడియాతో మెత్కుపల్లి మాట్లాడుతూ వైసిపి అధినేత జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్ తో కలిసి అడుగులు వేస్తానని ప్రకటించారు.

Related image

అంతేకాకుండా సమాజంలో బలహీనంగా ఉండే వారిపట్ల అండగా ఉండే కుటుంబం వైఎస్ కుటుంబమని అన్నారు...ఈ సందర్భంగా ఆయన చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా అవరసమైతే నేను ఆయనతో ఓ రోజు పాదయాత్ర చేస్తానని అన్నారు .ఎప్పుడైతే చంద్రబాబు టీడీపీ పార్టీ నుండి సస్పెండ్‌ చేసిండో అప్పుడే ఆయన  పతనం ప్రారంభమైందన్నారు.

Image result for motkupalli narasimhulu

నమ్మేవాడి గొంతు కోసే నమ్మకద్రోహం చేసే వ్యక్తి చంద్రబాబు….అది ప్రజలు అయినా..పిల్లనిచ్చిన మామ అయినా...ఇంకా మరెవరైనా ఆయన దృష్టిలో కేవలం అవసరం తీరేదాకా ఉపయోగించుకుంటారు తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు అని అన్నారు.

Image result for motkupalli narasimhulu crying

ఇన్ని రోజులు పోనీలే అని గమ్మున ఉంటే కిరాయికి అమ్ముడుపోయానని నాపై తప్పుడు మెసేజ్‌లతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తావా? పిచ్చి పిచ్చిగా మెసేజ్‌లు పెడితే ఊరుకోను. నువ్వేమైనా దొరవా? సుద్ద పుసవా? నరహంతకుడివి.. దొంగవి… ఎన్టీఆర్‌ స్పిరిట్‌ నాలో ఎంతకాలం ఉంటే అంతకాలం పని చేస్తా’ అని మోత్కుపల్లి సంచలన వాఖ్యలు చేశారు. ప్రస్తుతం మెత్కుపల్లి చేసిన ప్రకటన తెలుగు తమ్ముళ్ల శిబిరంలో కంగారు పెట్టేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: