-2021–22 సీజన్లో ఇచ్చిన మొత్తం రూ.6,899.67 కోట్లు
-గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద అందించిన మొత్తం రూ.19,812.79 కోట్లు
-ఇవీ రైతు భరోసా లెక్కలు అని ప్రధాన మీడియా చెబుతోంది..
-ఇది ఏపీ సర్కార్,పీఎం కిసాన్ సంయుక్తంగా అందిస్తున్న పథకం.
ఈ నేపథ్యంలో ఇవాళ తెలుగు రాష్ట్రాలలో నెలకొన్న ఓ అనూహ్య పరిణామమే ఇది.అనూహ్యం ఎందుకంటే అటు తెలంగాణలో రైతు బంధు పేరిట కేసీఆర్ యాభై వేల కోట్ల రూపాయలు విడుదల చేయనుండగా,మరోవైపు రైతు భరోసా పేరిట జగన్ తన వంతుగా 50,58,489 మంది రైతులకు మేలు చేకూర్చేందుకు 1,036 కోట్ల రూపాయలు మూడో విడత కింద విడుదల చేశారు. ప్రతి ఏటా మూడు విడతలుగా అందించే భరోసా మొత్తం 13,500 కోట్ల రూపాయలు కాగా ఆఖరి విడతలో ఒక్కో రైతుకు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తారు.మొదటి విడతలో ఏడు వేల 500 రూపాయలు,రెండో విడతలో నాలుగు వేల రూపాయలు అందించగా,ఆఖరు విడతగా ఏడాది ఆరంభంలోనే రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు రైతు భరోసా నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అని వైసీపీ వర్గాలు, అమాత్యుల బృందాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.కానీ క్షేత్ర స్థాయి వాస్తవాలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి.వైసీపీ సర్కారు చెప్పుకునేందుకు పైన పేర్కొన్న అంకెలు బాగానే