అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఇక అధికారంలో ఉన్న జగన్ ను గద్దె దింపేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి  అయితే కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే జగన్ మాత్రం మరో పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరీలోకి దిగారు. ఇక ఇప్పటికే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. మరోసారి ఏపీలో తమ పార్టీ అధికారిని దక్కించుకుంటుంది అనే ధీమాతో ఉన్నారు సీఎం జగన్.


 అయితే జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మూకుమ్మడిగా విమర్శలు చేస్తూ ఉండగా.. అన్ని విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తుంది వైసీపీ.. రాష్ట్రవ్యాప్తంగా సిద్ధం అనే సభలను నిర్వహిస్తూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అయితే జనసేన పార్టీ  టిడిపితో పొత్తు కారణంగా కేవలం 21 స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధమైంది.  జనసేన తరఫున ఎంతోమంది నటీనటులు ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. కాగా తమ పార్టీ తరఫున ప్రచారం చేయబోయే స్టార్ క్యాంపైనర్ల డీటెయిల్స్ ని ఇటీవల ప్రకటించింది జనసేన.


 ఇక ఇందులో కొంత మంది జబర్దస్త్ నటులు కూడా ఉండడం గమనార్హం. ఇక ఇదే విషయంపై వైసీపీ స్పందిస్తూ జనసేన స్టార్ క్యాంపైనర్లపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేశావు అన్నమాట.. రాజకీయాలు అంటే మీ జనసేన పార్టీకి అంత కామెడీ అయిపోయాయి. ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలు ఎందుకు డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్ షీట్లు చూసుకోండి అంటూ సోషల్ మీడియాలో ఒక కౌంటర్ ఇస్తూ పోస్ట్ పెట్టింది వైసిపి. ఈ పోస్ట్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: