ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చిత్తూరు జిల్లా పర్యటన చేస్తూ ఉండడంతో ఏపీ అంతట హై టెన్షన్ కనిపిస్తోంది. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డు వద్దకు జగన్ వెళ్ళబోతున్నారు. అయితే ఈ యాడ్ చిన్నది కావడం వల్ల కేవలం 500 మందికి మాత్రమే అక్కడ పోలీస్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా ఎలాంటి రోడ్డు షోలు ఎలాంటి ర్యాలీలు చేయకూడదని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.దీంతో ఒక్కసారిగా పోలీసులు తీరుపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.


ఈ రోజున బెంగళూరు నుంచి చిత్తూరు పర్యటనకు రాబోతున్న జగన్ ముఖ్యంగా మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వస్తున్నారు. ఈ పర్యటన కోసం ఈరోజు ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 11 గంటలకు బంగారుపాళ్యం కు రాబోతున్నారు. ఆ తర్వాత అక్కడ మార్కెట్ యార్డులో 11:20 నుంచి 12:20 వరకు ఉండి రైతులతో ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. తిరిగి మళ్లీ 12:35 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని బెంగళూరుకి ప్రయాణించబోతున్నారట.


మాజీ సీఎం జగన్ పర్యటనతో  ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సొంత జిల్లా కావడం చేత.. టిడిపి, వైసిపి మధ్య ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది.. భారీగా కాసిన మామిడికి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పాటుగా మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద రైతులు సైతం రాత్రిళ్ళు కూడా పడికాపులుకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని చర్చ మొదలయ్యింది.. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా మద్దతు తెలపడంతో ఈ సమస్య పొలిటికల్ ఇష్యూ గా మారిపోతున్నది. బంగారుపాళ్యం పర్యటించిన నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనే టెన్షన్ ఇప్పుడు ఏపీ అంతట మొదలైంది. అయితే ఇన్ని ఆంక్షలు నడుమ జగన్ వస్తు ఉండడంతో అభిమానులను ఈ ఆంక్షలు ఆపుతాయా అనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటివరకు జగన్ వెళ్ళిన ప్రతిచోట కూడా భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలు వచ్చారు. మరి ఈ రోజున ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: