తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటాలకు, జరగుతున్న పనులకు ఏమాత్రం పొంతనలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తుత్తి బడ్జెట్‌ ప్రవేశపెట్టారని అన్నారు. బడ్జెట్‌లో 37 శాతం లేదని ఉన్నట్లుగా చూపించారని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల అమ్మి ఏడాదిలో రూ.13,500కోట్లు తెస్తామని ముఖ్యమంత్రి చెప్పారని అందంతా బోగస్‌ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులేదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆదాయం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కరెంట్‌ ఇస్తామన్నా ఇతర రాష్ట్రాల నుంచి కరెంట్‌ కొంటున్నారని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: