సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టులో 4వికెట్ల తేడాతో గెలుపొంది చరిత్ర సృష్టించింది వెస్టిండీస్. ఓవర్నైట్ స్కోరు 280/8తో ఐదో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 33 పరుగులకు మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి రెండో ఇన్నింగ్స్ లో 313పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది దాంతో విండీస్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది.ఇక లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 4ఓవర్ లో ఓపెనర్ క్యాంప్ బెల్ రిటైర్ హర్ట్ గా వెనుదిరగగా ఆ తరువాత 27పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈదశలో బ్లాక్ వుడ్, రోస్టోన్ ఛేజ్ ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. ఈజోడి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో విండీస్ కు గెలుపు పై ఆశలు చిగురించాయి అయితే 100 పరుగుల వద్ద రోస్టన్ ఛేజ్ (37) అవుట్ కాగా ఆతరువాత వచ్చిన డౌరిచ్ తో బ్లాక్ వుడ్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.