క్రికెట్ ప్రేమికులంతా ప్రపంచకప్ మత్తులో మునిగి తేలుతున్నారు, ప్రపంచకప్ ఆరంభం నుండే విజయ దుందుభి మోగిస్తుంది టీమిండియా,నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా టీమ్ ఇండియా ఆటగాళ్లు సత్తా చాటారు.
టీమిండియా జట్టు కు దాదాపు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే.ప్రపంచ కప్ షెడ్యూల్ లో టీమిండియాకు ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగానే టీమ్ ఇండియా సెమీస్ వైపు అడుగులు వేస్తోంది,
మిగతా అన్ని మ్యాచ్ లలోనూ తమ విజయాల జైత్ర యాత్ర ఇలాగే కొనసాగించాలని టీం ఇండియా ఆటగాళ్లు అనుకుంటున్నారు.ఇదిలా ఉండగా పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్తాన్ సెమీస్ కి రాకూడదు అనే ఉద్దేశంతో బంగ్లాదేశ్ మరియు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లలో ఇండియా ఓడిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘన్ పై భారత్ కావాలనే నిదానంగా ఆడిందని,
ఇండియా తో మ్యాచ్ లో వార్నర్ ఉద్దేశపూర్వకంగానే అవుట్ అయ్యాడు అని ఆరోపించారడు. బసిత్ అలీ వ్యాఖ్యలపై ఇండియన్  క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: