తెలుగు బుల్లితెరపై, జబర్దస్త్ పలు రకాల టీవీ షో lలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రీతూ చౌదరి.. పలు సీరియల్స్లలో కూడా నటించింది. యూట్యూబ్ ఛానల్స్ లలో వీడియోలతో సోషల్ మీడియా గ్లామర్ ఫోటోలు సంపాదించుకుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం రీతూ చౌదరి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో పేరు వినిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈమె పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది.


రీతు చౌదరి మాట్లాడుతూ తాను బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోషన్స్ చేయలేదని చెప్పను..చేశాను కానీ చేసింది ఎన్ని అనేది కూడా చూడాలిగా తాను ప్రమోషన్ చేసినట్లు ఇష్టం వచ్చినట్లుగా ఎవరూ రాయవద్దు.. దాని గురించి తనకు తెలియనప్పుడు చేశానని తెలిశాక అసలు చేయలేదని తెలిపింది రీతూ చౌదరి.. తాను ఒకటి రెండింటిని మాత్రమే ప్రమోట్ చేశానని అన్నిచోట్ల కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని.. ఆ విషయం తప్పు అని తనకు ఎలా తెలుస్తుందని అందుకే తెలియకనే చేశాను కాబట్టి మళ్ళీ తప్పు చేశానని వీడియోను కూడా పెట్టానని తెలియజేసింది.

అంతేకాకుండా ఇక మీదట ఎవరు ఇలాంటివి చేయకూడదని చెప్పాము.. కానీ కొంతమంది సెలబ్రిటీల మీద చాలా తప్పుగానే ప్రమోట్ చేస్తూ ఉన్నారని రాస్తున్నారని తెలిపింది. బెట్టింగ్ యాప్స్ లలో లక్షలలో కోట్లలో ఏమి రావు మధ్యలో కూడా చాలామంది ఉంటారు. ఆ ప్రమోషన్స్ తన దగ్గరికి వచ్చేసరికి కేవలం 50 వేల రూపాయలు మాత్రమే మిగులుతుందంటూ తెలియజేసింది రీతు చౌదరి.కోట్లకు కోట్ల రూపాయలు సంపాదించారని బెట్టింగ్ యాప్స్ వల్లే ఇదంతా సాధ్యమైందని మాట్లాడుకునే వారందరికీ కూడా రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి రీతూ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: