పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టడం మొదలు పెట్టారు. ఆరు రోజులు గడిచిన తరువాత మధురైలో ఆమెతోపాటు ఆమె ప్రియురాలును కూడ పట్టుకున్నారు పోలీసులు. వారిరువురిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందే తన ప్రియురాలితో పారిపోవాలనుకున్నానని, తన తల్లిదండ్రుల ఇచ్చే బంగారు ఆభరణాల కోసం వేచి చూశానని చెప్పింది ఆ యువతి. ఆమె ప్రియురాలితో కలిసి త్రిసూర్ నుంచి చెన్నైకి రైలు టికెట్ బుక్ చేసినట్టు విచారణలో వెల్లడైంది. రైలులో ప్రయాణించకుండా వారు బస్సులో కొట్టాయంకు వెళ్లారు. మరుసటి రోజు చెన్నై వరకు రైలు ఎక్కారు. ఆ తరువాత చెన్నై నుంచి మధురై వెళ్లి అక్కడ ఓ హోటల్లో బస చేసారు. అక్కడ వారు ఒక రోజు గడిపారు.
ద్విచక్ర వాహనంపై ఎర్రాకులం వెళ్లి 10 రోజుల పాటు అడ్వాన్స్ చెల్లించి వస్తువులను అక్కడే ఉంచి తిరిగి మధురై వచ్చారు. మధురైలోని ఓ వస్త్ర దుకానంలో ఉద్యోగాలు చేస్తూ తమ జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె ప్రియురాలు కూడ నూతనంగా పెళ్లి అయిన మహిళే కావడం విశేషం బంగారు ఆభరణాలను తీసుకొని పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. ఈ విషయం తెలిసిన భర్త గుండెపోటు వచ్చినది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.