కావాల్సిన ప‌దార్థాలు:
మష్రూమ్స్‌- 200 గ్రా
మిరియాల పొడి- ఒక టీ స్పూను
టమోటా ప్యూరీ- రెండు టేబుల్ స్పూన్లు

 

బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు
మైదా- రెండు టేడుల్ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు

 

కారం- ఒక టీ స్పూను
ఉప్పు- రుచికి స‌రిప‌డా
నీరు- అరకప్పు

 

సోయా సాస్‌-  రెండు టీ స్పూన్లు
పచ్చిమిర్చి- మూడు
కొత్తిమీర తరుగు- కొద్దిగా

 

నూనె- వేగించడానికి సరిపడా
ఉల్లిపాయలు- రెండు
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు

 


తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్‌, మైదా, కారం, ఉప్పు వేసి నీటితో జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలుగా తరిగిన మష్రూమ్స్‌ను ఈ మిశ్ర‌మంలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. ఇప్పుడు మరో పాన్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు చిటికెడు ఉప్పు వేసి వేగించాలి. 

 

తర్వాత సోయా సాస్‌, టమోటా ప్యూరీ వేయాలి. రెండు నిమిషాల తర్వాత పక్కనుంచిన మష్రూమ్స్‌ వేసి చిక్కబడేవరకూ ఉంచి చివ‌రిలో కొత్తిమీర చల్లి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే మష్రూమ్స్ మంచూరియా రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: