చెక్ రిపబ్లిక్ కార్ తయారీ కంపెనీ 'స్కోడా' (Skoda) యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన 'కుషాక్' (Kushaq) ఎస్‌యూ‌వి కార్ ఇప్పుడు 'మోంటే కార్లో ఎడిషన్‌' ఇండియన్ మార్కెట్లో విడుదలవడానికి రెడీ అయిపోయింది. ఇక కంపెనీ ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్ ను 2022 మే 09 వ తేదీన విడుదలచేయనున్నట్లు తెలిపింది.ఇక త్వరలో విడుదల కానున్న ఈ కొత్త ఎడిషన్ కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ వుంది. అదేంటో తెలుసుకుందాం.స్కోడా మోంటే కార్లో ఎడిషన్‌ ఇప్పుడు ఆఫీషియల్ గా మార్కెట్లో విడుదల కాకముందే డీలర్ స్టాక్‌యార్డ్‌లో కనిపించింది. ఇక ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే ఈ కొత్త ఎడిషన్ వివిధ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మనకు కనిపించిన ఫోటోల ప్రకారం ఇది 'టోర్నాడో రెడ్ కలర్' ఆప్సన్ లో కూడా ఉంది. అందువల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.ఇక స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్‌ సరికొత్త డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అనేక అప్డేటెడ్ ఫీచర్స్ ని పొందుతుంది. అంతే కాకుండా ఈ కార్ లేటెస్ట్ కాస్మెటిక్ అప్డేట్స్ కూడా పొందింది.



ఇప్పుడు రివీల్ అయిన ఫోటోల ప్రకారం, ఇది గ్లోస్ బ్లాక్ రూఫ్, ఓఆర్‌విఎమ్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ ఇంకా అలాగే ఫ్రంట్ ఫెండర్‌లపై 'మోంటే కార్లో' బ్యాడ్జింగ్ వంటి బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్ ని కూడా పొందింది.అలాగే వీటితో పాటు కంపెనీ 'స్కోడా' బ్యాడ్జ్ ఇంకా అలాగే 'కుషాక్' వంటి బ్యాడ్జ్ లు దాని బూట్ పైన బ్లాక్ కలర్ లో ఉండటం కూడా మీరు గమనించవచ్చు. ఇక అంతేకాకుండా రియర్ ప్రొఫైల్ లో టెయిల్ లాంప్ వంటివి అయితే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.ఇక 'కుషాక్ మోంటే కార్లో ఎడిషన్‌' యొక్క ఇంటీరియర్ విషయానికి కనుక వస్తే, ఈ కార్ లోని డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్ ఇంకా అలాగే డోర్ ప్యాడ్స్ గ్లోస్ రెడ్ ఇన్సర్ట్‌తో పాటు బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మొత్తం మీద ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ కలర్ పొందటంతో పాటు అక్కడక్కడా క్రోమ్ ని కూడా పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: