మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు. బాబాయి హంతకులను సీబీఐ పట్టుకోకున్నా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టుకుని.. వాస్తవాలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ, మీ బాబాయిని హత్య చేసిన హంతకులను సీబీఐ ఇంకా పట్టుకోలేదని మీరు బాధ పడుతున్నారా? ఇప్పటి సీబీఐ అసలు ముద్దాయిలను పట్టుకొని మిమ్ము సంతోష పెట్టలేకపోతే, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక మీ బాబాయిని నరికి చంపిన అసలు ముద్దాయిలను పట్టుకొని వాస్తవాలను ప్రజల ముందుంచుతామని.. మీకు ఓకేనా? అని వర్ల రామయ్య జగన్ను ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులెవరో ఇంతవరకు సీబీఐ తేల్చకపోవడంపై వైఎస్ కుటుంబ అభిమానులే కాకుండా ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు కూడా నత్తనడకన సాగుతోందని, కావాలనే కేసు దర్యాప్తులను నెమ్మదింపచేస్తున్నారా? అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ను ఉద్దేశించి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పలు వ్యాఖ్యలు చేశారు. బాబాయి హంతకులను సీబీఐ పట్టుకోకున్నా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పట్టుకుని.. వాస్తవాలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి గారూ, మీ బాబాయిని హత్య చేసిన హంతకులను సీబీఐ ఇంకా పట్టుకోలేదని మీరు బాధ పడుతున్నారా? ఇప్పటి సీబీఐ అసలు ముద్దాయిలను పట్టుకొని మిమ్ము సంతోష పెట్టలేకపోతే, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక మీ బాబాయిని నరికి చంపిన అసలు ముద్దాయిలను పట్టుకొని వాస్తవాలను ప్రజల ముందుంచుతామని.. మీకు ఓకేనా? అని వర్ల రామయ్య జగన్ను ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యకేసులో నిందితులెవరో ఇంతవరకు సీబీఐ తేల్చకపోవడంపై వైఎస్ కుటుంబ అభిమానులే కాకుండా ప్రజలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తు కూడా నత్తనడకన సాగుతోందని, కావాలనే కేసు దర్యాప్తులను నెమ్మదింపచేస్తున్నారా? అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా ప్రశ్నిస్తున్నారు.