ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది.  కొందరిలో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల కొద్ది రోజుల్లోనే జుట్టు పలుచగా మారిపోతుంటుంది. ఈ క్రమంలోనే జుట్టు రాలడాన్ని తగ్గుంచుకునేందుకు ఖరీదైన ఆయిల్, షాంపూ తో పాటుగా మార్కెట్లో దొరికే సీరం వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు. అయినా కానీ జుట్టు రాలడం కంట్రోల్ కాక తెగ కంగారు పడిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్ ని పాటిస్తే హెయిర్ ఫాల్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా ఈజీగా ఆగిపోతుంది. ఈ టిప్ వాడితే అసలు ఒక్క వెంట్రుక కూడా రాలదు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం . ముందుగా ఒక బౌల్ ని తీసుకుని అందులో నాలుగు మందారం పూలు, నాలుగు మందారం ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు ఇంకా ఒక కప్పు నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి.


తరువాత రోజు నానబెట్టుకున్న మందారం పువ్వులు, ఆకులు ఇంకా అవిసె గింజలను నీటితో సహా మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ శీకాకై పౌడర్ ఇంకా ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల దాకా బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర తరువాత మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి. వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం కూడా క్రమంగా తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ సమస్య మళ్ళీ వేధించదు. జుట్టు రాలడాన్ని అడ్డుకోవడంలో ఈ రెమెడీ చాలా సూపర్ గా పని చేస్తుంది.పైగా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా అలాగే బాగా పొడుగ్గా కూడా పెరుగుతుంది.ఇంకా అలాగే డ్రై హెయిర్ సమస్య నుంచి కూడా ఈజీగా విముక్తి లభిస్తుంది. జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా సైతం మెరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: