ఈ ఏడాది ఎక్కువగా బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుతూ ,నెమ్మదిగా తగ్గుతూ ఉన్నాయి. దీంతో బంగారం కొనాలి అనే వారు కూడా భయపడేలా ధరలు పెరిగిపోతూ ఉండడంతో కొనడానికి సామాన్య ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వారు కూడా ఎక్కువగా ఉన్న.. సామాన్యులకు మాత్రం ఇది గుదిబండల మారిపోయింది.అసలు బంగారం పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.



ఇప్పుడు తాజాగా మళ్లీ బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాయి. ఒకటి ప్రపంచంలో ఉన్నటువంటి బ్యాంకులు మధ్యన బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండడం.. వాళ్ల దగ్గర రిజర్వులుగా పెట్టుకుంటూ ఉండటం వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. అలాగే ఇరాన్ ,ఇజ్రాయిల్ వార్ అది అను యుద్ధం వైపుగా దారితీస్తుందా.. మూడో ప్రపంచ యుద్ధం వైపు దారితీస్తుందా అన్నది తెలియాలి.. ప్రస్తుతానికైతే అమెరికా, యూరప్ దేశాలు ఏవి కూడా ఇజ్రాయిల్ కి అండగా నిలవడం లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ ,ఇరాన్ సంగతి తేల్చుకుంటాయి . ఉక్రేణి ముందు పెట్టి రష్యా మీద ఎలా అటాచ్ చేశారో ఇజ్రాయిల్ ముందు పెట్టి ఇరాన్ ను అలాగే ప్రొసీడ్ చేస్తుంది.


అలాకాకుండా ఒకవేళ ఇరాన్ గనుక ఇజ్రాయిల్ మీద దాడి వరకు అయితే వీళ్ళు కూడా పట్టించుకోరు. ఇక వీరిద్దరి మధ్య తెలుసుకోవాల్సి ఉంటుంది వెనుక నుంచి సహకరిస్తూ ఉంటారు. అయితే కేవలం ఆయుధాలు లేదా డబ్బులు సహాయం కావాలంటే చేస్తుంటారు. ఒకవేళ ఇరాన్ అమెరికా మీద దాడి చేసిందా.. అది మూడో ప్రపంచ యుద్ధం వైపుగా దారి తీసేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ పెరిగేటువంటి అవకాశం ఉన్నది కొద్దిరోజులపాటు ఉంటుందని తెలుస్తోంది. మరి ఎంత పెరుగుతుంది అన్న సంగతి మాత్రం ఇంకా విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: