ఈ రోజుల్లో చాలా మంది కూడా హార్ట్‌ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. కరోనా పాండమిక్ తరువాత అయితే ఈ మరణాలు చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.ఇలా చిన్న వయస్సులోనే గుండె పోటు వస్తుండడం అందరినీ ఎంతో షాక్‌కు గురి చేస్తోంది. ఎంత ఫిట్‌గా ఉంటున్నప్పటికీ పెద్ద పెద్ద డబ్బున్న సెలబ్రిటీలు కూడా చిన్న వయస్సులోనే హార్ట్‌ ఎటాక్‌ బారిన పడుతున్నారు. అయితే హార్ట్‌ ఎటాక్‌ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది.సాధారణంగా గతంలో 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే హార్ట్‌ ఎటాక్‌లు ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి కూడా ఈ హార్ట్‌ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నాయి. అది కేవలం గుండె ఆరోగ్యంపై శ్రద్ధ చూపించకపోవడం వల్లనే హార్ట్‌ ఎటాక్‌లు సంభవిస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వ్యాయామం చేయకపోవడం, అతిగా తినడం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం, పొగ తాగడం, మద్యం సేవించడం, రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రించడం ఇంకా రోజూ ఒకే చోట కూర్చుని పనిచేయడం వంటివన్నీ హార్ట్‌ ఎటాక్‌లు వచ్చేందుకు వెనుక ఉన్న ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.


అయితే మీరు రోజూ ఒక పొడిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. దీంతో లైఫ్‌లో హార్ట్‌ ఎటాక్‌లు వచ్చే చాన్స్‌లు చాలా వరకు ఈజీగా తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదే అర్జున బెరడు. ఈ బెరడును మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బెరడు లేదా పొడి ఏదైనా సరే ఒక గ్లాస్‌ పాలలో వేసి బాగా మరిగించాలి. ఆ ఈ పాలను తాగాలి. ఇలా మీరు రాత్రిపూట తీసుకోవాలి. ఇంకా అలాగే అర్జున చెట్టు బెరడను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా అర్జున చెట్టు బెరడును ప్రతి రోజూ తీసుకోవడం వల్ల హార్ట్‌ ఎటాక్‌లు రావని చెబుతున్నారు.అంతేగాక ఈ చెట్టు బెరడు ఇతర సమస్యలను కూడా ఈజీగా తగ్గిస్తుంది. అలాగే బీపీని ఖచ్చితంగా నియంత్రణలోకి తెస్తుంది. ఇంకా షుగర్‌ను కూడా తగ్గించగలదు. అయితే చిన్నారులు ఇంకా గర్భిణీలు మాత్రం దీన్ని డాక్టర్ల సలహా మేరకు వాడుకోవాలి. ఇక అర్జున చెట్టు బెరడును తీసుకోడం వల్ల ఆస్తమా, దగ్గు కూడా ఈజీగా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: