సాధారణంగా ప్రజలు ఎక్కువగా జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పి వంటివి వచ్చాయంటే ఎక్కువగా చాలామంది పారాసెట్ మాల్ టాబ్లెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో వీటిని తరచూ ఎక్కువగా ఉపయోగించే వాళ్ళమని కూడా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో తరచు మన దేశంలో ఎక్కువమంది ఇళ్లలో ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వైద్యుల్ని కూడా సంప్రదించకుండా ఈ మాత్రలని వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటికి ఈ టాబ్లెట్ చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. అయితే పారాసెట్మాల్ మాత్రాలను ఎలా పడితే అలా వాడితే తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా తలెత్తుతాయట.


పారాసెటమాల్ ను ఎక్కువగా ఉపయోగించుకోవడం వల్ల మన శరీరంలో ఉండే కాలేయం, మూత్రపిండాలపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. పారాసెటమాల్ మాత్రలు అనేక బ్రాండ్లలో దొరుకుతూ ఉంటాయి అయితే 60 కిలోల కంటే ఎక్కువ 30 కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వారు ఈ పారాసెటమాల్ టాబ్లెట్ని ఎంత మోతాదులో వేసుకోవాలి తెలియకపోవచ్చు.. కానీ వయసు బరువు ప్రకారం పారాసెట్మాల్ డోస్ వేసుకోకపోతే జ్వరం నుంచి కోలుకోవడానికి బదులుగా మనం మరింత అనారోగ్యానికి గురవుతామట. డోసు ఎక్కువ అవుతే ఈ ఔషధం కాలేయం మూత్రపిండాలపైన ప్రభావం చూపిస్తుంది.


ఎవరైనా సరే ఒకరోజులో నాలుగు గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి పారాసెట్మాల్ టాబ్లెట్లు తీసుకుంటే అది చాలా ప్రమాదమట.. గర్భిణీ మహిళలు పారాసెట్మాల్ వాడితే పిల్లలు అనారోగ్యానికి హాని కరుగుతుందట. 40 కిలోల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు 20 ఏళ్లు దాటిన 500 MG నుంచి 640 MG వరకు పారాసెట్మాల్లో నాలుగు నుంచి ఆరు గంటల వ్యవధిలో వేసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలైతే వారి బరువును బట్టి పారాసెటమాల్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక నెల కంటే తక్కువ వయసు ఉన్న వారు 10 నుంచి 15 MG పారాసెట్మాల్ మాత్రమే వేసుకోవాలి మూడు రోజులపాటు ఇలా వేసుకున్నట్టు జ్వరం తగ్గుతుంది. లేనిపక్షంలో వైద్యులను సంప్రదించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: