తాజాగా విక్టరీ వెంకటేష్‌ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'F3'.ఇక ఈ సినిమా  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు.అయితే ఈ సినిమాలో తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్‌, రాజేంద్ర ప్రసాద్‌, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమా మే 27న  విడుదలైంది. ఇకపోతే కొన్ని చోట్ల ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.దీనితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చింది.కాగా లాజిక్స్ లేనప్పటికీ సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. 

అయితే రెండు రోజులకు గాను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.18.72 కోట్లను వసూలు చేసింది. ఇక రే సీన్3మ్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. రూ.23 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది.తాజా సమాచారం ప్రకారం 'ఎఫ్3' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది.అయితే నాలుగు వారాల థియేట్రికల్ రన్ తరువాతే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ మధ్యకాలంలో నెగెటివ్ టాక్ వస్తోన్న సినిమాలను ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే కానీ 'ఎఫ్3' సినిమాని కామెడీ కాపాడేసింది.

అంతేకాకుండా  పైగా దిల్ రాజుఁ నిర్మాత కాబట్టి కనీసం మూడు వారాల పాటు ఈ సినిమాను నడిపించేస్తారు. అయితే ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం.. జూన్ చివరి వారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.ఇక ఎఫ్ 3 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో ఎఫ్ 4 ని కూడా ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే f3 సినిమా చివర్లో ఎఫ్ 4 ఉంటుందని అనిల్ రావిపూడి హింట్ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ప్రస్తుతం అభిమానుల్లో సైతం ఎఫ్4 ఫై ఆసక్తి నెలకొంది.ఇక బాలయ్యతో సినిమా తర్వాత F4 ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు అనిల్ రావిపూడి..

మరింత సమాచారం తెలుసుకోండి: