కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితమే విజయ్ 'బీస్ట్' మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యింది. అనేక అంచనాల నడుమ విడుదలైన బీస్ట్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మూవీ కి తమిళనాడు లో పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్ లు వచ్చినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన రేంజ్ లో  కలెక్షన్ లను అందుకోలేక పోయింది. ఇలా 'బీస్ట్' మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన తలపతి విజయ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరిసు (వారసుడు) మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళం లో షూటింగ్ జరుపుకొని తెలుగు లో డబ్ అయ్యి విడుదల కానుంది. తమిళ్ లో వరిసు పేరుతో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు లో వారసుడు పేరుతో విడుదల కానుంది. ఈ మూవీ లో తలపతి విజయ్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా, సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తలపతి విజయ్మూవీ కి సంబంధించిన మొదటి సింగిల్‌ ను పూర్తి చేశాడు. ఈ సాంగ్ ని సిద్ శ్రీరామ్ మరియు జోనితా గాంధీ పాడినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని దర్శకుడు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విజయ్ కు సంబంధించిన కొన్ని పోస్టర్ లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: