ఇటీవల వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్, స్వప్నదత్ ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ 'సీతారామం'. అంతేకాదు  ఈ పిక్చర్ ను జనాలు విశేషంగా ఆదరిస్తు్న్నారు.ఇకపోతే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు.కాగా  సుమంత్, రష్మిక మందన కీలక పాత్రలు పోషించారు. అయితే  ఈ సినిమా దర్శకుడు హను రాఘవపూడి గత చిత్రాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఈ ఫిల్మ్ మాత్రం అంచనాలను మించి ఉంది.ఇకపోతే దర్శకుడు హను రాఘవపూడికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.

కాగా  ఈ సినిమాకు ముందే ఆయనకు తన చాలా సినిమాల స్టోరిలు చెప్పానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.అయితే  'లై' ఫిల్మ్ స్టోరితో పాటు పలు స్టోరిలు చెప్పానని తెలిపారు. ఇక తారక్ మెహిదీపట్నంలోని ఇంట్లో ఉన్నపుడు తాను ఆయన వద్దకు వెళ్లి స్టోరిలు చెప్పానని గుర్తు చేసుకున్నాడు.కాగా తన స్టోరిలు విని తారక్ ఓకే అన్నారని, కానీ, ఆయనకున్న స్టార్ ఇమేజ్ కు సరిపోయే స్టోరి తన వద్ద బహుశా ఇంకా రెడీ కాలేదని స్పష్టం చేశారు హను.అయితే  నేచురల్ స్టార్ నాని కోసం తాను రాసుకున్న స్టోరి ఉందని, ఆయనతోనే అది తీయాలని హను వివరించారు. ఇక దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ లతో తను మరొక సినిమా చేయాలని.. 

అశ్వనీదత్ బ్యానర్ లోనే ఆ పిక్చర్ ఉంటుందని అన్నారు హను.అయితే హను రాఘవపూడి-తారక్ కాంబోలో సినిమా రావాలంటే అందుకు తగ్గ స్టోరి ఉండాలని హను తెలిపారు. ఇక తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వసిని మా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఆ ఫిల్మ్ ఉండబోతున్నది.  RRR తర్వాత తారక్ చేస్తున్న ఈ పిక్చర్ పైన భారీ అంచనాలున్నాయి.వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: