శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి నటిగా తనకంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ హిందీ లో నటించిన సినిమాల ద్వారా తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కొన్ని రోజుల క్రితమే జాన్వి కపూర్ "గుడ్ లక్ జెర్రీ" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న జాన్వి కపూర్ తన తల్లి అయినటు వంటి శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజా ఇంటర్వ్యూ లో జాహ్న కపూర్ ... శ్రీదేవి గురించి స్పందిస్తూ ...  మా అమ్మ స్టార్ డమ్ కి దగ్గరగా ఎవరు కూడా వెళ్లలేరు అనుకుంటున్నాను. అమ్మ స్టార్ డమ్ అనుభవిస్తున్న సమయంలో నేను లేను. అమ్మతో కలిసి పని చేసిన వారు చెబుతుంటే ఆమె ఏమిటో అర్థం అయ్యింది. అమ్మను అంతా ప్రశంసించేవారు అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా జాహ్న కపూర్ చెప్పు కొచ్చింది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ ప్రస్తుతం కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన తెలుగు మూవీ లైగర్ లో ఈ ముద్దు గుమ్మ కు హీరోయిన్ పాత్రకు అవకాశం వచ్చినట్లు ,  కాక పోతే ఆ సమయంలో జాహ్న కపూర్ వేరే మూవీ లతో బిజీ గా ఉండడం వల్ల ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ 30 వ మూవీ లో కూడా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఈ ముద్దు గుమ్మ ను సంప్రదించినట్లు కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: