లైగర్ సినిమా విడుదల కంటే ముందు జనగణమన చిత్రం సినిమా కాస్త షూటింగ్ జరుపుకున్న లైగర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశారు. ఈ సినిమాకి నిర్మాతగా ఛార్మి ,వంశీ పైడిపల్లి వ్యవహరించారు. అయితే ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జనగణమన సినిమా షూటింగ్ ఆగిపోలేదని.. ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో కాకుండా ఇతర హీరోలతో చేసేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు పొందాలని చూస్తున్నారు పూరి జగన్నాథ్.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దగ్గర బాలీవుడ్ హీరోల సైతం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ తదితర హీరోలతో చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా తన డ్రీం ప్రాజెక్టుని ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరితో చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. లైగర్ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు పూరి జగన్నాథ్. ఇటీవల ఒక విలాసవంతమైన ఇంటిని ఆఫీసును కూడా అక్కడ నిర్మించి.. హైదరాబాదుకు వచ్చినట్లుగా వార్తలు వినిపించాయి. మరి పూరి జగన్నాథ్ జనగణమన సినిమాని తెరకెక్కిస్తారా లేదా అనే విషయాన్ని పై క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.