మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ లలో ఒకరు అయిన కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కత్రినా కైఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విక్టరీ వెంకటేష్ హీరో గా తెరకెక్కిన మల్లీశ్వరి మూవీ తో మంచి విజయాన్ని ,  మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే కత్రినా కైఫ్ నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా తరకెక్కిన అల్లరి పిడుగు మూవీ లో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఇలా తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న హీరోల సరసన హీరోయిన్ గా నటించి  , మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి ఛాన్స్ లు రావడం ,  అలాగే కత్రినా కైఫ్ నటించిన మూవీ లు కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా కత్రినా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో వరస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీయేస్ట్ హీరోయిన్  గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కత్రినా కైఫ్ తన కెరియర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో కత్రినా కైఫ్ మాట్లాడుతూ ... కెరియర్ ప్రారంభంలో సాయ అనే మూవీ లో ఒక చిన్న పాత్రలో నటించాను. ఆ మూవీ లో నాపై ఒక షాట్ తీసి , ఆ తర్వాత నన్ను మూవీ నుండి తొలగించారు. నటికీ ఉండవలసిన ఒక మంచి లక్షణం కూడా నాలో లేదు అని అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ అవ్వాలి అన్న కసి చాలా పెరిగింది అని కత్రినా కైఫ్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: