సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. పూజ హెగ్డేమూవీ లో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది వరకే మహేష్ బాబు మరియు పూజ హెగ్డే కాంబినేషన్ లో మహర్షి మూవీ తెరకెక్కింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని వీరిద్దరి జోడి కి కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఇది వరకే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు , ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలకు అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పూజా హెగ్డే కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 15 వ తేదీ నుండి పూజా హెగ్డేమూవీ రెండవ షెడ్యూల్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బంధం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లో 28 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ చిత్రకరణ ఎస్ఎస్ఎంబి 28 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: