తెలుగు ఇండస్ట్రీలో ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు నేంబర్ వన్ రేస్ లో ఉన్న హీరో. ఆ మద్య కొరటాల శివ, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం కమర్షియల్ గానే కాకుండా సోషల్ మెసేజ్ తో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. అంతే కాదు ఈ చిత్రంతో మహేష్ 150 కోట్ల క్లబ్ లో చేరారు. ఆ చిత్రం తర్వాత ‘బ్రహ్మోత్సవం’ తో ఘోర పరాజయం పొందాడు. ఇక తన తదుపరి చిత్రం సూపర్ హిట్ కావాలనే ఉద్దేశ్యంతో తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ తో ‘స్పైడర్’ చిత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలా నెలలు గడుస్తుంది. ఇప్పటికే పలు మార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. సాధారణంగా మహేష్ తన తండ్రి కృష్ణ పుట్టినరోజు కానుకగా తన కొత్త సినిమా తాలూకు స్టిల్ ని కానీ టీజర్ ని కానీ రిలీజ్ చేస్తూ అభిమానులను సంతోష పెడుతున్నాడు. కానీ ఈ సారి ఆ అవకాశం ఉండదని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు . అయితే అదే సమయంలో తన సెంటిమెంట్ ని కొనసాగించేలా ఏదో ఒకటి చేయండని దర్శకులు మురుగదాస్ పై అలాగే చిత్ర బృందం పై సీరియస్ అయ్యాడట.
దీంతో అలర్ట్ అయిన చిత్రం బృందం కృష్ణ పుట్టినరోజు సందర్బంగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు.మహేష్ కూడా ఈ విషయాన్నీ స్వయంగా ట్వీట్ చేసి మరింత ఖుషీ చేసాడు . నాన్న పుట్టినరోజు ని పురస్కరించుకొని అభిమానులను అలరించడానికి రెడీ అంటూ ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తాడు మహేష్. ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో హిట్స్ అందించిన మురుగదాస్ ఈ సారి మహేష్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అందించబోతున్నారని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.