మాలీవుడ్ హాట్ బ్యూటీ అమలాపాల్ అంటేనే వివాదాలు అనేలా మారింది పరిస్థితి. ఇప్పటికే పలు సంచలనాలు రేపిన ఈ అమ్మడు తాజాగా తనకు సంబంధించిన ఓ యోగా వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి హల్ చల్ సృష్టించింది. గతంలో అమలాపాల్ ఓ హాట్ యోగా ఫొటోలు విడుదలయ్యాయి. ఈ యోగా ఫొటోల్లో ఓ గోడపై బుద్ధుడి బొమ్మ ఉంది. ఆ గోడకు అమలాపాల్ శీర్షాసనం వేసింది.. అయితే ఆమె కాళ్ళు బుద్ధుడి ముఖానికి తాకుతున్నాయి. దీంతో బుద్ధుని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దాంతో ఆ విషయం కాస్త పెద్ద రగడ అయ్యింది.
తాజాగా అమలాపాల్ తాను యోగాకి బాగా ఎడిక్ట్ అయిపోయానని అంటుంది. ప్రతిరోజూ యోగా చేయనిదే తాను ఉండలేనని ఈ మద్య ఎంతో కష్టపడి శీర్షాసనం కూడా నేర్చుకున్నాని అంటుంది. ఈ ఆసనం నేర్చుకునే సమయంలో తాను ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందని..మొత్తానికి పట్టుబట్టి ఈ ఆసనం నేర్చుకున్నానని అంటుంది ఈ మళియాళ బ్యూటీ. నా అప్పర్ బాడీ కొంచెం వీక్గా ఉండటంతో టీచర్ సాయంతోనో లేదా గోడ ఆసరాగా చేసుకొనో ఆసనం వేయగలుగుతున్నాను.
విడాకుల తరువాత వరుస పెట్టి చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఛాన్స్లు తగ్గాయి. దాంతో అమలా పాల్ కి సినిమా చాన్సులు తగ్గాయి. ఇక తన గ్లామర్ డోస్ ఎక్కువ పెంచితే తప్ప కుర్ర హీరోయిన్లకు పోటీ కాలేనని భావించిన అమలాపాల్ ఇప్పుడు తన ఫిట్ నెస్ పై దృష్టి సారించింది. సినిమాలు లేకపోవడంతోనే అమలాపాల్ ఇలా సోషల్ మీడియాలో నేను ఉన్నాను అని గుర్తు చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.