ప్రస్తుత అన్నీ ఇండస్ట్రీలలో బయోపిక్ల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. రాజకీయ నాయకులతో పాటు, క్రీడాకారుల చరిత్ర, వీరితో పాటుగా సినీ తారల జీవిత కథలను కూడా బయోపిక్ తీసేందుకు పోటి పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే టాలీవుడ్ లో సావిత్రి జీవిత కథతో మహానటి, ఎన్టీఆర్ జీవితం పై ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు వచ్చాయి. అయితే చాలా కాలంగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ పై కూడా చర్చ జరుగుతోందని సినీ వర్గాలు చెపుతున్నాయి.
ప్రస్తుతం ప్రతి రోజు పండగే ప్రమోషన్స్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. మీడియా ధరమ్ తేజ్ ను మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ తెరకెక్కిస్తే అందులో చిరు పాత్రలో మీరు నటిస్తారా.. అంటూ ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరంగా స్పందించి మెగాస్టార్ బయోపిక్కు తాను న్యాయం చేయలేనన్న సాయి, రామ్ చరణ్ అయితే తండ్రి పాత్రకు పర్ఫెక్ట్ అన్నాడు.
మెగా హీరోలందరిలో మెగాస్టార్ పోలికలు ఎక్కువగా ఉన్న వ్యక్తి సాయి ధరమే. ముఖ్యంగా మెగాస్టార్ పాటల రిమిక్స్లలో సాయిని చూస్తే మెగాస్టారే తెర మీద కనిపిస్తున్నాడా అన్నంతగా మెప్పిస్తాడు. అయితే సాయి మాత్రం చిరు పాత్రకు చిరు తనయుడే కరెక్ట్ అంటూ రామ్చరణ్ మీదకి నెట్టేశాడు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిరోజు పండగే సినిమాతో ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. తాత మనవడి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో తాత పాత్ర సీనియర్ నటుడు సత్యరాజ్ నటించాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్.