రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ రేంజే మారిపోయింది. ఆ చిత్రం తరువాత తెరకెక్కే చిత్రాలన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలుగానే తెరకెక్కిస్తున్నాడు. దాదాపు అన్ని భాషల్లో విడుదలయ్యేలా చూస్తు్నాడు డార్లింగ్ ప్రభాస్. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా ప్యాన్ ఇండియా మూవీగానే తెరకెక్కింది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పీరియాడిక్ లవ్ స్టోరీలో చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ టైటిల్ను చిత్ర యూనిట్ ఇప్పటి వరకు కూడా వర్కింగ్ టైటిల్గా చెప్పుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు టైటిల్ మార్చే పనిలో ఉందని సమాచారం. ఈ చిత్రానికి మైడియర్, రాధేశ్యామ్ అన్న టైటిల్ను తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. అయితే ఈ రెండు టైటిల్స్లో ఎక్కువ ఏదైతే మంచి టాక్ వస్తుందో అలాగే చిత్ర యూనిట్ నుంచి మోజారిటీ ఒపినియన్ తీసుకుని టైటిల్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం.
సినిమాను తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మరియు హిందీలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే అన్ని భాషలకు అనుకూలంగా ఉండేటట్లు ఒకే టైటిల్ ఉండేలా ఓ డియర్ మరియు రాధేశ్యామ్లను పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే. 1980 ఇటలీ నేపథ్యంలో సినిమా ఉంటుందని ఇప్పటికే యూనిట్ సభ్యులు తెలియజేశారు. ఈ చిత్రంతో ప్రభాస్ మరోసారి ఆల్ ఇండియా సూపర్ స్టార్ అనిపించుకోవాలని ప్రయత్నాలు. మరి ఈ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచిచూడాలి.
ఇక ఇదిలా ఉంటే మరి కొంత మంది నిన్ననే విడుదలైన సమంత జాను చిత్రం హిట్ అయింది. మరి ఈ చిత్ర టైటిల్కి దానికి దగ్గర పోలికలు ఉండడంతో కొంత ప్రేక్షకుల్లో ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటుందా అని ప్రభాస్ వద్దనుకున్నారా అనే అనుమానాలు కూడా ఓ పక్క వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ కోసం ఆయన ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ అనే చెప్పాలి.