టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు హీరోలు విలన్ లు గా మారే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. తమ మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నం లో భాగంగా కొందరు ఇప్పుడు విలన్ లు గా మారడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న హీరోలు కూడా ఇప్పుడు పెద్ద హీరోలకు విలన్ లు గా మారడానికి ఎక్కువగా కష్టపడే పరిస్థితి టాలీవుడ్ లో ఉందీ అనేది వాస్తావం. టాలీవుడ్ లో పెద్ద హీరోలు కూడా తమ  ప్రతి నాయకుడి గా హీరోనే కోరుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో గోపి చంద్ విలన్ గా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. 

 

ఆయనను విలన్ గా చెయ్యాలని కొందరు హీరోలు కూడా స్వయంగా అడిగారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. అగ్ర హీరోలు కూడా ఆయన్ను విలన్ గా అడిగినట్టు సమాచారం. ఇది నిజమో కాదో గాని టాలీవుడ్ జనాలు మాత్రం గోపి చంద్ ఇప్పుడు చిరంజీవి సినిమాలో విలన్ గా చెయ్యాలని చూస్తున్నాడని అంటున్నారు. గోపి చంద్ కోసం చిరంజీవి ఎక్కువగా అడిగారని టాక్. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా తర్వాత గోపి చంద్ విలన్ గా ఒక సినిమా చెయ్యాలని చిరంజీవి చూస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి. అందుకోసం ఒక కథ కూడా రెడీ గా ఉందని టాక్. లూసిఫర్ సినిమాలో విలన్ గా గోపి చంద్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. 

 

గోపి చంద్ కూడా భారీగా డిమాండ్ చేయకుండా తక్కువకే చేద్దాం అని భావిస్తున్నట్టు సమాచారం. చిరంజీవి స్వయంగా గోపి చంద్ కి ఫోన్ కూడా చేసి అడిగారని సమాచారం. అందుకే అంగీకరించాడు అని అంటున్నారు. ప్రస్తతం ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: