మెగా సినిమాలు తీసిన దర్శకులు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాళ్లతో సినిమాలు చెయ్యడానికి హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ సురేందర్ రెడ్డికి మాత్రం హీరోలే దొరకట్లేదు. భారీ హిస్టారికల్ డ్రామా సైరాతో మెప్పించిన సూరీ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లాక్ చేసుకోలేకపోతున్నాడు. 

 

సైనా సినిమాతో బాలీవుడ్ లోనూ ప్రశంసలు తెచ్చుకున్నాడు సురేందర్ రెడ్డి. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో రూపొందిన సైరాకు టాలీవుడ్ సెలబ్స్ నుంచీ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అయితే ఇన్ని ప్రశంసలు వచ్చినా సురేందర్ రెడ్డి తర్వాతి మూవీపై క్లారిటీ మాత్రం లేదు. ఈ దర్శకుడు హీరోను ఒప్పించడానికి చాలా కష్టపడుతున్నాడట. 

 

సైరా తర్వాత సురేందర్ రెడ్డి, ప్రభాస్ తో సినిమా తీస్తాడనే ప్రచారం జరిగింది. కానీ డార్లింగ్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ కుమార్, నాగ్ అశ్విన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తర్వాత వరుణ్ తేజ్ ని డైరెక్ట్ చేస్తాడనే టాక్ వచ్చింది. క్రిష్ నిర్మాణంలో మెగా ప్రిన్స్ తో సురేందర్ రెడ్డి సినిమా తీస్తాడనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కూడా వర్కవుట్ కాలేదని చెప్పుకుంటున్నారు సినీజనాలు. 

 

ప్రభాస్, వరుణ్ తేజ్ ఇలా చాలా పేర్ల తర్వాత ఇప్పుడు రామ్ పేరు వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో సినిమా ప్లాన్ చేశాడనే టాక్ వస్తోంది. ఆల్ రెడీ డిస్కషన్స్ కంప్లీట్ అయ్యాయనీ.. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెబుతున్నారు. 

 

రెడ్ మూవీ కంప్లీట్ అయ్యాక సూరీ-రామ్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి హీరోల కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తోన్న సూరి.. రామ్ తో ఎలాంటి కథాంశాన్ని తెరకెక్కిస్తాడు అనేది చూడాలి. 

 

సక్సెస్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు తీసేందుకు హీరోలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే సురేందర్ రెడ్డికి హీరోలు దొరకకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: