సుకుమార్ దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడిప్పుడు.
అల్లు అర్జున్ హీరోగా ఈయన తెరకెక్కిస్తున్న పుష్ప
సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈయన బిజీ అయిపోతున్నాడు. తన అసిస్టెంట్స్ను దర్శకులుగా పరిచయం చేస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు శిష్యులను దర్శకులుగా పరిచయం చేసి విజయం అందుకున్నాడు సుకుమార్. తాజాగా ఈయన శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన
సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు 80 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది ఉప్పెన. ఈ సినిమాకు
సుకుమార్ చేసిందేం లేదు. కేవలం సమర్పకుడిగా ఉండి.. బుచ్చిబాబుకు కావాల్సిన ప్రమోషన్ ఇచ్చాడంతే. కథా చర్చల్లో అప్పుడప్పుడూ పాల్గొని సరైన మార్గంలో ఉప్పెనను మళ్లించాడు. ఈ సినిమాను మైత్రి
మూవీ మేకర్స్తో కలిసి నిర్మించాడు సుకుమార్. ఈ సినిమాకు సహాయ సహకారాలు అందించినందుకు 10 కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది.అలాగే ఆయన సొంత సినిమాల్లో కూడా
సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన పుష్ప తర్వాత చేస్తున్న
విజయ్ దేవరకొండ సినిమా వచ్చే సంక్రాంతికి మొదలుకాబోతుంది అని టాక్ నడుస్తుంది.
సుకుమార్ ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసుకొని ఆ సినిమాని పట్టాలు ఎక్కిస్తారట. ఇక విజయ్ ప్రస్తుతం
పూరి తో కలిసి లిగర్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో
విజయ్ కి జోడిగా
హిందీ భామ, స్టార్ కిడ్
అనన్య పాండే నటిస్తోంది. ఈ
సినిమా షూటింగ్ ముంబైతో పాటు విదేశాల్లో ఈ
సినిమా షూటింగ్ జరుగుతోంది. . పాన్
ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో
బాలీవుడ్ హీరో
సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. . ఓ డాన్ పాత్రలో
సునీల్ శెట్టి కనిపిస్తారట. తాజాగా ఈ
సినిమా విడుదల తేదిని ఖరారు చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాను
సెప్టెంబర్ 9న దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.