యువ హీరో సుశాంత్ సింగ్.. మాజీ ప్రియురాలు అయినా అంకితా ఇప్పుడు వివాహం చేసుకుంటోంది. ఈ విషయాన్ని తనే అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను వీడియోలను కూడా తెలపడం జరిగింది. సుశాంత్ సింగ్, అంకితా కొన్ని సంవత్సరాలపాటు ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ తమ కెరీర్ని ఒకేసారి ప్రారంభించినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కలిసి బుల్లితెర మీద తెగ సందడి చేసేవారట.

కానీ వీరిద్దరు తమ కెరియర్ మీద దృష్టి పెట్టాలని ఉద్దేశంతోనే వీరిద్దరూ విడిపోయారని పలు సందర్భాలలో తెలియజేశారు. వీరిద్దరు విడిపోయినప్పటికీ చాలా మంచి స్నేహితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సుశాంత్ మరణించిన తరువాత.. ఈమె పై కొందరు ట్రోలింగ్ కూడా చేశారట. నువ్వు సుశాంత్ తో బ్రేకప్ చెప్పడం వల్లే.. ఇలాంటి పరిస్థితి ఎదురైందని ఆమెను ట్రోల్ చేశారట. ఆమె అప్పటికే వేరొక వ్యక్తితో జీవితం గడపాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం.

కానీ సుశాంత్ అభిమానులు మాత్రం కొంత మంది ఆమెకు సపోర్టుగా నిలిచారట. సుశాంత్ మరణంపై ఆమెకు ఎలాంటి సంబంధం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. సుశాంత్-అంకితా విడిపోయిన తర్వాత.. అంకితా విక్కీజైన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరి పెళ్లి ఎప్పుడో జరగాల్సింది. కానీ కరోనా వల్ల ఆగిపోయింది. అయితే ఆ తర్వాత వివాహం చేసుకోవాలనుకున్న అప్పటికీ సుశాంత్ సింగ్ మరణం వీరిని చాలా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.
అయితే ఇప్పుడు పరిస్థితులు అన్నీ సర్దు మునగడంతో విక్కీజైన్ తో ఆమె వివాహం చేసుకొని  బాలీవుడ్లో సెటిల్ అయిందని ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది.ఈ ఫోటోలు వైరల్ కావడంతో కొంతమంది ప్రముఖులు వీరిని ఆశీర్వదించారు. మరికొందరు మాత్రం చూడ ముచ్చటైన జంట అంటూ కామెంట్ చేస్తున్నారు. విక్కీ జైన్ ఎవరో కాదు అంకితా చిన్ననాటి స్నేహితుడేనట. వీరిద్దరు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: