దర్శకుడిగా పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఏ స్థాయి క్రేజ్ ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఆయన లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. తొందరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల ఉన్న నేపథ్యంలో తాను ఏ సినిమాకు తీసుకొని విధంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో సమయం కేటాయించడం విశేషం. ఆగస్ట్ 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ సినిమా ద్వారా తాను కూడా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని పూరి జగన్నాథ్ ఆలోచిస్తున్నాడు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో ఆయన కృష్ణా నగర్ కష్టాలు పడ్డాడు అని అందరికీ తెలిసిందే. మొదట్లో ఆయన హీరోల డేట్స్ కోసం చాలా తిరిగేవాడు. అలా సినిమా ప్రయత్నాలలో తిరుగుతున్న సమయంలో జరిగిన ఓ సంఘటనను నటి హేమ ఇప్పుడు గుర్తు చేసుకుంది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా పూరి తో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంది. ఓకే ఇంట్లో పైన హేమ ఉండగా అదే సమయంలో కింద రూమ్ కి పూరి జగన్నాథ్ వచ్చాడట. అప్పుడే పూరి తో పరిచయంయింది హేమ. సినిమా పరిశ్రమలో ఒకరికొకరు సహాయం చేసుకునే వారట వీరు. 

ఆ తర్వాత ఒకానొక సమయంలో తన భార్య లావణ్య ప్రేమించిన పూరి జగన్నాథ్ ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట. అప్పుడు హేమ దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇంటివారు అయ్యేలా చేసిందట. అలా పూరి జగన్నాథ్ వివాహానికి కారణం అయ్యానని హేమ తెలిపింది. ఏదేమైనా పూరి జగన్నాథ్ సినిమాలే కాదు ఆయన లవ్ స్టోరీ కూడా ఎంతో అడ్వెంచరస్ అని చెప్పాలి . హీరోల పాత్రను ఎంతో డిఫరెంట్ గా తీర్చిదిద్ది ఇప్పుడు యంగ్ హీరోలకు భారీస్థాయిలో హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్ నిజంగా గొప్ప దర్శకుడు అని చెప్పాలి. 



 

మరింత సమాచారం తెలుసుకోండి: